ఇంట గెలిచి రచ్చ గెలవండి

టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు  ఇటీవలె 420 బర్త్ డే చేసుకున్నాడని ఎపీ మంత్రి కారుమూరు నాగేశ్వర రావు చేసిన ప్రకటనను తెలుగుదేశం పార్టీ శ్రేణులు తప్పుపడుతున్నాయి. వైఎస్ జగన్ బాబాయ్ వైఎస్ వివేకా హత్య కేసులో కుటుంబ సభ్యులే నిందితులుగా  ఉన్న విషయాన్ని ఈ శ్రేణులు గుర్తు చేస్తున్నాయి. వివేకా మరణానికి గుండెపోటు కాదని తేలిపోయింది. నరికి చంపినట్లు నిర్ధారణ అయ్యింది. స్వంత బాబాయి హత్యకు గురయితే ఈ కేసులో సంబంధం ఉన్న వ్యక్తులను ఢిల్లీ వెళ్లి పైరవీ చేయించుకునే స్థాయికి దిగజారాడని టీడీపీ వర్గాలు ఆరోపిస్తున్నాయి. ఈ కేసులో ఎంపీ అవినాశ్ రెడ్డి తండ్రి వైఎస్  భాస్కర్ రెడ్డిని  సీబీఐ అరెస్ట్ చేసింది.  వైఎస్ కుటుంబానికి చెందిన భాస్కర్ రెడ్డితో పాటు మరో ఏడుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.బాధితుడు, హంతకులు ఒకే కుటుంబానికి చెందిన వాళ్లు ఉండటం ఏపీ ప్రజలు ఊహించలేకపోతున్నారు. చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రి కావాలని ప్రజలు  కోరుకుంటున్నారని, ఆయన బర్త్ డే సందర్బంగా దేవాలయాలు, మసీదులు, చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు చేశారని టీడీపీ శ్రేణులు గుర్తు చేస్తున్నాయి. ఆస్ట్రేలియా మెల్బోర్న్, ఐర్లాండ్లలలో చంద్రబాబు జన్మదిన వేడుకలు జరిగాయి. విదేశాల్లో  కూడా చంద్రబాబు బర్త్ డే  వేడుకలు ఘనంగా జరుపుకోవడాన్ని వైఎస్ఆర్ కాంగ్రేస్ జీర్ణించుకోలేకపోతుందని, వైఎస్ వివేకా హత్య కేసు మూలాలు పులివెందుల చుట్టే తిరుగుతున్నాయని వాళ్లు గుర్తు చేశారు. వైఎస్ వివేకా కూతురు సునీత తన కుటుంబ సభ్యులను పోలీసులకు పట్టిస్తుంది. తన తండ్రి గుండెపోటుతో మరణించలేదని తొలుత చెప్పింది సునీత అయితే జగన్ ప్రభుత్వం ఈ విషయాన్ని ఎందుకు గుర్తించలేదని  టీడీపీ ప్రశ్నిస్తోంది. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu