భార్యాభర్తలు.. ఒకరినొకరు నరుక్కున్నారు..

 

భర్తని భార్య, భార్యని భర్త చంపేసిన సంఘటనలు ఎన్నో వున్నాయి. ఉత్తర ప్రదేశ్‌లో భార్యాభర్తలు ఒకరినొకరు చంపుకున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని హర్దోయ్ ప్రాంతంలోని రాఘవ్ పూర్వ గ్రామంలో రమాకాంత్, గుడియా అనే జంట పెళ్ళయినప్పటి నుంచీ తీవ్రంగా గొడవ పడుతూనే వుండేవారు. ఆదివారం నాడు కూడా వీళ్ళిద్దరూ తీవ్ర స్థాయిలో గొడవపడ్డారు. గొడవ పెరిగిపోవడంతో ఒకరి మీద మరొకరు గొడ్డలితో దాడి చేసుకున్నారు. ఈ దాడిలో ఇద్దరూ గాయపడ్డారు. రక్తపు మడుగులో కొట్టుమిట్టాడుతున్న వారిని ఆస్పత్రికి తరలిస్తూ వుండగా భార్యాభర్తలు ఇద్దరూ మరణించారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu
Related Segment News