హైదరాబాద్‌లో బాబోయ్ చిరుతపులి

 

హైదరాబాద్ శివార్లలో చిరుత విహరిస్తూ జనాల గుండెల్లో రైళ్ళు పరిగెత్తిస్తోంది. హైదరాబాద్ శివార్లలో వున్న రాజేంద్రనగర్ చుట్టపక్కల వున్న గ్రామాలలో గత కొద్ది రోజులుగా చిరుత తిరుగుతోంది. ఇప్పటి వరకు ఈ చిరుత మనుషుల మీద దాడి చేయపోయినప్పటికీ ఒక లేగదూడను చంపి తిన్నది. కొంతమంది మనుషులు చిరుతపులిని చూసినట్టు చెబుతున్నారు. రాజేంద్రనగర్ సమీపంలోని బండ్లగూడ, కిస్మత్పూర్ గ్రామాల పరిసర ప్రాంతాల్లో ఈ చిరుత సంచరిస్తున్నట్లు గ్రామస్థులు అంటున్నారు. తమ గ్రామాల పరిసర ప్రాంతాల్లో చిరుత పులి సంచరిస్తున్నట్లు ఈ రెండు గ్రామాల సర్పంచులు రాజేంద్రనగర్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu
Related Segment News