చర్మంపై దద్దుర్లు ఉన్నా కరోనా సోకినట్లే!

ఇప్ప‌ట్టి వ‌ర‌కు కరోనా లక్షణాల్లో జ్వరం, పొడి దగ్గు, అలసట, శ్లేష్మ దగ్గు, గొంతు నొప్పి, తలనొప్పి, కండరాల నొప్పి, చలి, వికారం, ముక్కులో ఇబ్బంది, ముక్కు నుంచి నీరు కారడం, విరేచనాలు వంటివి ఉండగా.. తాజాగా మరో లక్షణాన్ని గుర్తించారు డాక్టర్లు. చర్మంపై దద్దుర్లు ఉన్నా కరోనా సోకినట్లేనని చెబుతున్నారు.  

ఇటాలియన్‌ స్టడీ ప్రకారం.. కరోనా వైరస్ సోకిన ప్రతి ఐదు మందిలో ఒకరికి చర్మ సంబంధ వ్యాధులు ఉన్నట్లు తేలింది. కరోనా బాధితులకు చర్మం మీద ఎర్రటి దద్దుర్లు వస్తున్నాయని ఆ స్టడీ తెలిపింది. దీనికి సంబంధించి ఇంకా పరిశోధనలు జరగాల్సి ఉందని డాక్టర్లు అంటున్నారు.

ఒకవేళ దద్దుర్లు ఉండి జ్వరం, దగ్గు, నొప్పులు లేకుంటే వారు వైరల్ టెస్ట్‌ చేయించుకుంటే సరిపోతుందని డాక్టర్ మాయా వేదమూర్తి అన్నారు. ఈ వైరస్ చాలా ఇబ్బందికరంగా ఉంది. ఒక్కొక్కరిలో ఒక్కో విధంగా వైరస్ లక్షణాలు కనిపిస్తున్నాయని అపోలో ఆసుపత్రుల్లో పనిచేసే డాక్టర్ చెప్పారు. 

'ఇటలీలోని కరోనా బాధితుల్లో 20శాతం మందికి దద్దుర్లు ఉన్నాయి. అలాగే ఫిన్‌లాండ్‌, స్పెయిన్‌, అమెరికా, కెనడాలోని డాక్టర్లు సైతం కరోనా బాధితుల్లో ఎర్రటి పాచెస్‌, దురదలు ఉన్నట్లు వెల్లడించారు. ఈ విషయంపై ఇక్కడి కరోనా బాధితుల్లో  పరిశోధనలు జరుగుతున్నాయి. 

భారత్‌లో ఇలాంటి కేసులు ఇప్పటివరకు పెద్దగా నమోదుకాలేదు. ఇలాంటి దద్దుర్లు ఎక్కువగా కాలిపైనా, బ్రొటనవేలిపైనా.. ఒక్కొక్కసారి చేతులపైనా వస్తున్నట్లు వైద్యులు చెబుతున్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu