వందరోజులు.. వెయ్యి అబద్ధాలు.. 178 ఆత్మహత్యలు...

 

కాంగ్రెస్ పార్టీ ఫైర్ బ్రాండ్ రేణుకా చౌదరి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మీద విరుచుకుపడ్డారు. కేసీఆర్ వంద రోజుల పాలనలో ఆయన సాధించిన ప్రగతి వెయ్యి అబద్ధాలు చెప్పడం, 178 మంది రైతుల ఆత్మహత్యలకు కారణం కావడమని ఆమె విమర్శించారు. రైతు రుణమాఫీ మీద కేసీఆర్‌కి ఇప్పటికీ స్పష్టత లేదని ఆమె అన్నారు. రైతులను ఆదుకోని కేసీఆర్ ప్రభుత్వాన్ని బతుకమ్మ తల్లి క్షమించదని చచెప్పారు. ఎంఐఎంతో ఎలాంటి పొత్తు పెట్టుకోకుండా గ్రేటర్‌ హైదరాబాద్‌లో కాంగ్రెస్ సొంతంగానే ఎదగాలని ఆమె ఆకాంక్షించారు. హైదరాబాద్‌లో కల్లు దుకాణాల ఏర్పాటుకు వ్యతిరేకంగా హైదరాబాద్‌ కాంగ్రెస్ కార్యకర్తలు పోరాడాలని రేణుకా చౌదరి పిలుపునిచ్చారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu
Related Segment News