కాంగ్రెస్‌కు గుణపాఠం ; జెపి

 

ఈ రోజు ప్రకటించిన నాలుగు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్‌ పార్టీ వైఫల్యాలకు నిదర్శనం అన్నారు లోక్‌సత్తా పార్టీ అధ్యక్షుడు జయప్రకాష్‌నారాయణ. రెండు సార్లు దేశాన్ని పాలించిన కాంగ్రెస్‌ అన్నిరంగాల్లో విఫలమైందన్నారు. కాంగ్రెస్‌ వైఫల్యం వల్లే 4లక్షల 80 వేల కొట్ల విధ్యుత్‌ ప్రాజెక్ట్‌లు నిలిచిపోయాయన్నారు. దేశంలో పేదరికం తొలగిస్తామన్న కాంగ్రెస్‌ ప్రజలను మోసం చేసిందన్నారు. విద్య, వైధ్యరంగాలతొ పాటు దేశం అన్నిరంగాల్లో విఫలమవ్వటానికి కాంగ్రెస్‌ నిర్ణయాలే కారణం అన్నారు. దేశవ్యాప్తంగా వనరులు పుష్కలంగా ఉన్నా కాంగ్రెస్‌ వాటిని నాశనం చేసిందన్నారు జెపి.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu