మరోసారి హరీశ్ రావుకు హ్యాండ్ ఇచ్చిన కేసీఆర్..!

తెలంగాణలో అధికార పార్టీ టీఆర్ఎస్ లో కేసీఆర్ దే మొదటి స్థానం అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే కేసీఆర్ తరువాత స్థానం ఎవరిది.. కొడుకు కేటీఆర్ దా.. లేక మేనల్లుడు హరీశ్ రావుదా.. అంటే చెప్పలేని పరిస్థితి ఏర్పడింది. అయితే ఒకప్పుడు కేసీఆర్ తరువాత అంతటి బలం ఉన్న నాయకుడు హరీశ్ రావే.. కేసీఆర్ తరువాత స్థానం హరీశ్ రావుదే అని చాలామందే అనుకున్నారు. కానీ ప్రస్తుతం పరిస్థితి మారింది.. కేసీఆర్ కూడా హరీశ్ రావుకు ఇవ్వాల్సిన ప్రాధాన్యతను చిన్నచిన్నగా తగ్గిస్తూ.. కొడుకు కేటీఆర్ ను పైకి తీసుకురావాలని చూస్తున్నట్టు తెలుస్తోంది. ఈ విషయం ఇప్పటికే చాలాసార్లు రుజువైంది. మొన్న జరిగిన వరంగల్ ఉపఎన్నికలో హరీశ్ వర్గానికి చెందిన ఎర్రోళ్ల శ్రీనివాస్ కి టికెట్ ఇవ్వకుండా  పసునూరి దయాకర్ కి ఇచ్చారు. ఇప్పుడు కూడా మరోసారి రుజువు చేశారు కేసీఆర్.. తాజాగా తెలంగాణలో జరగబోయే 12 ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ హరీశ్ అనుచరులకు హ్యాండ్ ఇచ్చిన కేసీఆర్… కేటీఆర్ వర్గానికి చెందిన శంభీపూర్ రాజుకు వ్యక్తికి ఎమ్మెల్సీగా ఛాన్స్ ఇచ్చారు. దీంతో కేసీఆర్ హరీశ్ రావును తొక్కేస్తున్నట్టు స్పష్టంగా అర్ధమవుతోందని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu