ఓడిన మంత్రులకు జయలలిత ఝలక్..

 

ఓడిన మంత్రులకు జయలలిత ఝలక్.. ఇటీవలే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరిగాయన్న సంగతి తెలిసిందే. అయితే ఈ ఎన్నికల్లో ఓడిపోయిన మంత్రులకు అన్నాడీఎంకే అధినేత్రి, తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఓ ఝలక్ ఇచ్చినట్టు తెలుస్తోంది. వారిని పదవి నుండి తప్పించినట్టు తెలుస్తోంది. మొన్నటిదాకా విద్యుత్ శాఖ మంత్రిగా కొనసాగిన నాథమ్ ఆర్ విశ్వనాథన్ దిండిగల్ పార్టీ కార్యదర్శి పదవిని కోల్పోయారు. ఇక పార్టీ ఆర్గనైజింగ్ సెక్రటరీలుగా ఉన్న మాజీ మంత్రులు పొన్నయన్, పళనియప్పన్, పర్నుతి రామచంద్రన్, మోహన్ లను ఆ పదవుల నుంచి జయ తప్పించారు. ఇక తన నమ్మిన బంటు పన్నీర్ సెల్వం కుటుంబ ఆధిపత్యానికి చెక్ పెట్టిన జయలలిత ఆయన కుమారుడు రవీంద్రనాథ్ ను కూడా తేని జిల్లా కార్యదర్శి పదవి నుంచి తప్పించారు. మరి అమ్మ ఇంకా ముందు ముందు ఎన్ని నిర్ణయాలు తీసుకుంటారో చూడాలి.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu