కేసీఆర్ కు నేనెందుకు భయపడతాను..

 

తెలంగాణ సీఎం కేసీఆర్ అంటే చంద్రబాబుకి భయమంటూ పలువరు పలు సందర్భాల్లో విమర్శించిన నేపథ్యంలో టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఘాటుగానే స్పందించారు. నిన్న కడపజిల్లాలో జరిగిన మహా సంకల్ప సభలో పాల్గొన్న ఆయన ప్రధాని నరేంద్ర మోదీ సహా, తెలంగాణ సీఎం కేసీఆర్ లను చూసి తానెందుకు భయపడతానని ఆయన ప్రశ్నించారు. తాను నిప్పులాంటి మనిషినన్న చంద్రబాబు... ఏ ఒక్కరికీ భయపడే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. అయినా అవినీతి కేసులున్న జగన్ భయపడాలి గాని తానెందుకు భయపడతానని వ్యాఖ్యానించారు. '43 వేల కోట్ల మేర అవినీతికి పాల్పడ్డ జగన్... నన్ను ప్రజల చేత చెప్పులతో కొట్టిస్తాడా?' అని కూడా చంద్రబాబు ఘాటు వ్యాఖ్యలు చేశారు. మరి ఈ వ్యాఖ్యలపై జగన్ ఎలా స్పందిస్తారో చూడాలి.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu