చంద్రబాబు చెవిలో గవర్నర్.. ఏం చెప్పారబ్బా..!

 

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉమ్మడి తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ రాష్ట్రంలోని ఉమ్మడి సచివాలయంలో భేటీ అయిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన సచివాలయం మొత్తం సందర్శించి.. అనంతరం చంద్రబాబుతో పలు విషయాల గురించి చర్చించారు. అయితే ఇక్కడి వరకూ బానే ఉన్నా గవర్నర్, చంద్రబాబు వ్యవహరించిన తీరు ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. అదేంటంటే.. భేటీ అనంతరం ఇద్దరూ బయటకి రాగా నరసింహన్, చంద్రబాబుతో చెవిలో ఏదో చెప్పారు. అంతే దీంతో ఇప్పుడు అందరూ ఈ విషయం గురించే చర్చించుకుంటున్నారు. గవర్నర్, చంద్రబాబు చెవిలో చెప్పిన విషయం ఏంటబ్బా అని అనుకుంటున్నారు. ఎందుకంటే వీరిద్దరి ఇలా మాట్లాడుకున్న సందర్భాలు చాలా తక్కువ. పబ్లిక్‌గా ఇద్దరు ఇలా వ్యవహరించిన సందర్భం ఇప్పటివరకు రాలేదు. అందుకే అందరూ ఏం మాట్లాడుకున్నారా అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మరి నరసింహన్, చంద్రబాబు చెవిలో ఏం చెప్పారో తెలియాలంటే వెయిట్ చేయాల్సిందే.