పార్టీ మారే నేతలకు చంద్రబాబు ఆహ్వానం..!
posted on Dec 8, 2015 11:19AM
.jpg)
ఇరు తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం పార్టీ నేతల వలసల పర్వం నడుస్తోంది. తెలంగాణలో అధికారం టీఆర్ఎస్ పార్టీలోకి చేరడానికి మక్కువ చూపిస్తుంటే.. ఏపీలో టీడీపీలో చేరడానికి మక్కువ చూపిస్తున్నారు. ఈనేపథ్యంలోనే అటు కాంగ్రెస్.. వైసీపీ కాంగ్రెస్ నుండి నేతలు టీడీపీలోకి చేరడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అంతేకాదు వీరి రాకకు అధినేత చంద్రబాబు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇప్పటికే వైసీపీ పార్టీనుండి ఆదినారాయణరెడ్డి.. కొణతాల రామకృష్ణ టీడీపీలోకి చేరడానికి సిద్దమయ్యారు. వీరితో పాటు మాజీ కేంద్రమంత్రి.. కాంగ్రెస్ నాయకుడు సాయి ప్రతాప్ ను కూడా టీడీపీలోకి చేర్చుకోవాలని చంద్రబాబు చూస్తున్నారంట. అంతేకాదు ఓ కర్నూలు ఎంపీ.. నలుగురు శాసనసభ్యులు కూడా టీడీపీలోకి చేరడానికి ఆసక్తి చూపిస్తున్నారట. అయితే వీరందరి చేరికకు చంద్రబాబు పార్టీనేతలతో మాట్లాడి వారిని ఒప్పించే ప్రయత్నాలు చేస్తున్నట్టు రాజకీయవర్గాలు చర్చించుకుంటున్నాయి. ముఖ్యంగా ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ బలంగా ఉన్న నేపథ్యంలో ఆ ప్రాంతాల నుండి నేతలను టీడీపీలోకి తీసుకురావడానికి చంద్రబాబు ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. మొత్తానికి వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీలో కాని.. వైసీపీ లోకాని ముఖ్య నేతలెవరూ ఉండకుండా చూడాలని చంద్రబాబు వ్యూహాలు చేస్తున్నట్టు తెలుస్తోంది.