ఒక్కసారి.. ఒకే ఒక్కసారి అంటున్న చంద్రబాబు

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సింగపూర్ పర్యటనలో బిజీగా ఉన్నారు. ఏపీలో పెట్టుబడులు.. పరిశ్రమలు పెట్టడానికి గాను పారిశ్రామిక వేత్తలతో చర్చిస్తూ బిజీగా గడుపుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన ఏపీలో పెట్టుబడులు పెట్టాలని.. పెట్టుబడులు పెట్టడానికి ఏపీ అనువైన ప్రదేశమని.. దీనికి సంబంధించి వరల్డ్ బ్యాంకు కూడా ఏపీకి రెండో ర్యాంకు ఇచ్చిందని తదితర అంశాల గురించి ఆయన ప్రస్తావించారు. అంతేకాదు ఏపీలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకురావాలంటూనే అంతకు ముందు ఒక్కసారి ఏపీకి రావాలని.. అక్కడి పరిస్థితులను చూసి.. పరిశీలించి ఆతర్వాత నిర్ణంయ తీసుకోండంటూ ఆసక్తికరంగా వ్యాఖ్యానించారు. మొత్తానికి చంద్రబాబు ఏపీకి పెట్టుబడులు తీసుకురావడానికి.. ఏపీలో పెట్టుబడులను ప్రవాహంలా పారించడానికి బాగానే కష్టపడుతున్నట్టు తెలుస్తోంది. మరి చంద్రబాబు ఒక్కసారి ఏపీని విజిట్ చేయండి అని కోరినందుకైనా ఎంతమంది పారిశ్రామిక వేత్తలు ఏపీని విజిట్ చేస్తారో.. పెట్టుబడులు పెడతారో చూడాలి.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu