ఈసారి అడిగితే మూల్యమే.. టీసర్కార్ పై హైకోర్టు ఆగ్రహం

 

అధికారంలో ఉన్నాం కదా ఏం చేసినా చెల్లుద్ది.. ఏం నిర్ణయాలు తీసుకున్నా సరిపోద్ది అన్న పథాంలో  తెలంగాణ ప్రభుత్వం అంశం ఏదైనా కానీ వారికి ఇష్టమొచ్చినట్టు నిర్ణయాలు తీసేసుకున్నారు. ఇప్పుడు వాటివల్ల వచ్చే పరిణామాలను అనుభవిస్తున్నారు. ఇప్పటికే ఒకటి కాదు రెండు కాదు ఎన్నో విషయాల్లో హైకోర్టు చేత మొట్టికాయలు తింటూనే ఉంది. హైకోర్టు కూడా తెలంగాణ ప్రభుత్వ స్పీడుకు బ్రేకులు వేస్తునే ఉంది. ఇప్పుడు మరో  వివాదంలో హైకోర్టు తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై మండిపడింది. తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ సలహాదారులు..  ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధులు.. కార్పొరేషన్ ఛైర్మన్ లకు ఇచ్చిన క్యాబినెట్ హోదా విషయంపై.. ఎవరికి పడితే వారికి క్యాబినెట్ హోదా ఇచ్చేస్తున్నారని హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్య దాఖలైంది. దీనిపై గతంలో దీనిపై విచారణ జరిపిన హైకోర్టు తెలంగాణ ప్రభుత్వం ఎవరికి పడితే వారికి క్యాబినెట్ హోదా ఎలా ఇస్తారని ప్రశ్నిస్తూ.. వాదనలు వినిపించాలని కోరింది. అయితే గతంలో దీనిపై మూడుసార్లు విచారణ జరిపినా తెలంగాణ ప్రభుత్వం దానికి సమాధానం చెప్పలేక మరో వాయిదా కావాలని కోరడం జరిగింది. ఈసారి కూడా తెలంగాణ ప్రభుత్వం మరో వాయిదాని అడుగగా హైకోర్టు సీరియస్ అయింది. నాలుగు దఫాలుగా వాయిదాలు అడుగుతూనే ఉన్నారు.. కానీ వాదనలు వినిపించేది ఏమైనా ఉందా అని ప్రశ్నించింది. ఈసారి కనుక వాయిదా అడిగితే ప్రతి వాయిదాకు 3 వేల రూపాయలు చెల్లించాల్సి వుంటుంది అని ఆదేశించారు. మరి తెలంగాణ ప్రభుత్వం ఈసారైనా సమాధానం చెపుతుందో లేక మూల్యం చెల్లిస్తుందో చూడాలి.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu