ఏపీ క్యాబినేట్ ప్రక్షాళన.. దసరా తరువాత
posted on Sep 22, 2015 11:51AM

త్వరలో ఏపీ క్యాబినేట్ లో పలు కీలకమార్పులు జరగబోతానే సూచనలు మాత్రం స్పష్టంగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా సీఎం చంద్రబాబు ఈ విషయంలో చాలా ఖచ్చితంగా ఉన్నట్టు తెలస్తోంది. ఏపీ రాజధాని అమరావతి శంకుస్థాపన తరువాత క్యాబినేట్ ప్రక్షాళన చేయనున్నట్టు రాజకీయ వర్గాల వినికిడి. ముఖ్యంగా కొన్ని శాఖలు రెవెన్యూ, వైద్య ఆరోగ్య శాఖల మంత్రులు కేఈ, శ్రీనివాస్ కామినేనికి మాత్రం పదవీ గండం తప్పదని తెలుస్తోంది. ఇప్పటికే చంద్రబాబు ఈ శాఖా మంత్రుల తీరుపై సీరియస్ గా ఉన్నారు. విజయవాడలో జరిగిన కలెక్టర్ల సమావేశంలో ఈరెండు శాఖలకు సంబంధించి చేసిన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనమని తెలుస్తోంది. అయితే గత మూడు నెలల క్రితమే మంత్రుల తొలగింపు విషయం బయటకు వచ్చినా చంద్రబాబు సరైన సమయం కోసం ఎదురుచూశారు. ఇప్పుడు సింగపూర్ పర్యటనలో ఉన్న చంద్రబాబు తిరిగి వచ్చి మంత్రుల మార్పిడిపై దృష్టిసారించి.. అమరావతి శంకుస్థాపన తరువాత సరిగా పనిచేయని మంత్రులను ఇంటికి సాగనంపనున్నట్టు తెలుస్తోంది.