వాజుపేయి కల.. చంద్రబాబు ద్వారా తీరింది

 

ఏపీ ప్రభుత్వం చేపట్టిన నదుల అనుసంధానంలో భాగంగా ఈ రోజు సీఎం చంద్రబాబు పట్టిసీమ పంపు నుండి నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన విజయవాడ సమీపంలోని ఇబ్రహీంపట్నం వద్ద ఫైలాన్ ను ఆవిష్కరించారు. దీనికి కృష్ణ-గోదావరి నదుల పవిత్ర సంగమం అని పేరు పెట్టారు. ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు, స్పీకర్ కోడెల తదితరులు పాల్గొన్నారు. కాగా ఈ నదుల అనుసంధానం పై మాజీ రాజ్యసభ సభ్యుడు హరికృష్ణ, కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు స్పందించి చంద్రబాబును ప్రశంసించారు. ఈ సందర్భగా కేంద్రమంత్రి వెంకయ్య మట్లాడుతూ నదుల సంధానం అనేది వాజుపేయి కల చంద్రబాబు ద్వారా అది నెరవేరిందని.. నదుల అనుసంధానికి పట్టిసీమ తొలి అడుగు అని.. గంగా, కావేరీ నదుల అనుసంధానానికి పట్టిసీమ స్ఫూర్తి అని అన్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu