చిరు బిజెపిలోకా...రఘువీరా అసంతృప్తి
posted on May 23, 2014 1:34PM
.jpg)
కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యులు చిరంజీవి భారతీయ జనతా పార్టీలో చేరుతారని జరుగుతున్న ప్రచారంపై ఆంధ్రప్రదేశ్ ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షులు రఘువీరా రెడ్డి అసంతృప్తిని వ్యక్తం చేశారు. చిరంజీవి బీజేపిలోకి చేరుతున్నారని వస్తున్న వార్తలను ఆయన ఖండించారు. చిరు పార్టీ మారటంలేదని ఆయన స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ చిరుకు ఎంతో గౌరవం ఇచ్చి రాజ్యసభ సభ్యత్వం ఇచ్చిందని అన్నారు. అలాంటిది ఆయనకు ఇప్పుడు పార్టీ మారాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. రాజకీయాలలో గెలుపు ఓటములు సహజమని, ప్రజలు తీర్పును నేతలను అగీకరించి సీమాంధ్ర అభివృద్దికి పాటు పడాలని అన్నారు. సీమాంధ్రలో కాంగ్రెసు పార్టీ బలోపేతంపై చిరు దృష్టి సారిస్తారని ఆయన అభిప్రాయపడ్డారు.