ఉపముఖ్యమంత్రిగా యనమల..!
posted on May 23, 2014 1:03PM

తెలుగుదేశం ప్రభుత్వ ఏర్పాటుకు సమయం దగ్గర పడుతున్నడంతో ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తన కేబినెట్ పైన కసరత్తు ప్రారంభించారు. దీంతో ముఖ్యమైన పదవులను ఎవరికి దక్కనున్నాయో అన్న చర్చ టిడిపి నేతలలో జోరుగా సాగుతుంది. తాజాగా అందిన సమాచారం ప్రకారం ఉపముఖ్యమంత్రి పదివి కోసం టిడిపిలో ఇద్దరూ ప్రముఖ నేతలు పోటీ పడుతున్నట్లు తెలుస్తోంది. ఈ రేసులో మండలి ప్రతిపక్ష నేత యనమల, సీనియర్ నేత కేఈ కృష్ణమూర్తిలు వున్నారు. అయితే చంద్రబాబు యనమల వైపే మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. రాయలసీమకు చెందిన బాబు ముఖ్యమంత్రి పదవిలో వుండగా అదే ప్రాంతానికి చెందిన మరో నేతకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తే పార్టీలో విభేదాలు వస్తాయని బాబు భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో బీసీకి చెందిన యనమలకే ఆ పదవి ఇవ్వాలని చంద్రబాబు డిసైడ్ అయినట్లు తెలుస్తోంది.