తెదేపా యం.యల్.సి. అభ్యర్ధుల పేర్లు ఖరారు

 

త్వరలో జరుగనున్న యం.యల్.సి. ఎన్నికలకు తెదేపా అభ్యర్దుల పేర్లను ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఖరారు చేసారు. నెల్లూరు తెదేపా యువత అధ్యక్షుడు బీదా రవిచందర్ మరియు గత పదేళ్ళుగా తూర్పు గోదావరి జిల్లా పార్టీ ప్రోగ్రాం కన్వీనర్ వ్యవహరిస్తున్న వి.వి.వి.చౌదరిని పార్టీ అభ్యర్ధులుగా ఖరారు చేసారు. యం.యల్యే కోటా క్రింద జరుగబోయే ఈ ఎన్నికలకు పార్టీ తరపున ముగ్గురు అభ్యర్ధులను నిలిపే అవకాశం ఉంది కనుక మూడవ అభ్యర్ధి పేరును కూడా నేడు ఖరారు చేసే అవకాశం ఉంది. ఆ స్థానానికి మైనార్టీ లేదా మహిళలకు కేటాయించాలని చంద్రబాబు నాయుడు భావిస్తున్నట్లు సమాచారం.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu