చంద్రబాబుకు పిచ్చి ముదిరింది: మంత్రి కొండ్రు

 

 

chandrababu babu, minister kondru murali, congress tdp, chandrababu padayatra

 

 

తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పాదయాత్రను రికార్డుల కోసం చేస్తున్నారా లేక ప్రజల కోసం చేస్తున్నారా చెప్పాలని మంత్రి కొండ్రు మురళి ప్రశ్నించారు. చంద్రబాబుకు పిచ్చి ముదిరిందని మంత్రి కొండ్రు మురళి మోహన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీపై, నేతలపై పాదయాత్రలో చంద్రబాబు చేస్తున్న వ్యాఖ్యలు సరికావన్నారు. తన తొమ్మిదేళ్ల పాలనలో చోటుచేసుకున్న అవినీతిని తెలిసేందుకే ఆయన యాత్రలో స్థూపాలు కడుతున్నారన్నారు. ప్రపంచంలో బాబును మించిన అవినీతిపరుడు లేడన్నారు. తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలు అందరూ కలిసి అధ్యక్షుడిని మార్చుకోవాలన్నారు. లేకుంటే ఆ పార్టీ పతనం కావడం ఖాయమన్నారు. విద్యుత్ ఛార్జీలు తగ్గించమంటే ముగ్గురిని పొట్టన పెట్టుకున్న ఘనుడు బాబు అని విమర్శించారు.