మంత్రులపై చంద్రబాబు సీరియస్

 

మంత్రుల పనితీరుపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేసినట్లు తెలుస్తోంది. ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన అమరావతి శంకుస్థాపన కార్యక్రమాన్ని చాలామంది మంత్రులు సీరియస్ గా తీసుకోలేదని, తాను రేయింబవళ్లు పనులను పర్యవేక్షించినా మంత్రులు మాత్రం అంటీముట్టనట్టుగా వ్యవహరించారని ఆగ్రహం వ్యక్తం చేశారట. వచ్చామావెళ్లామా అన్నట్లుగా మీడియాకి కనబడి వెళ్లిపోయారని, కనీసం గుంటూరు, కృష్ణాజిల్లాల మంత్రులు కూడా అమరావతి శంకుస్థాపన కార్యక్రమంలో ఇన్వాల్స్ కాలేదని చంద్రబాబు సీరియస్ అయ్యారని చెబుతున్నారు. మంత్రుల పనితీరుపై ఎప్పటికప్పుడు నివేదికలు తెప్పించుకునే చంద్రబాబు... అమరావతి శంకుస్థాపన కార్యక్రమం మీద కూడా రిపోర్ట్ తెప్పించుకున్నారని, అధికారులు ఇచ్చిన సమాచారం మేరకే చంద్రబాబు ... మంత్రులపై సీరియస్ అయ్యారని చెప్పుకుంటున్నారు, అయితే మంత్రులు కూడా బాబు తీరుపై అసహనం వ్యక్తంచేసినట్లు తెలిసింది, తమకు బాధ్యతలు అప్పగించకుండా బొమ్మల్లా ఉంచితే తామేం చేయాలని, అయినా కమిటీలు వేసి అన్ని పనులూ ఈవెంట్ మేనేజ్ మెంట్ సంస్థకే అప్పగిస్తే... మాకు ఏం పని ఉంటుందని మంత్రులు వాపోయారట.