ఫొటోలు వేయొద్దనడం సరికాదు... కేంద్రం

 

ప్రభుత్వ ప్రచార ప్రకటనల్లో ముఖ్యమంత్రులు లేదా మంత్రుల ఫొటోలు వేయరాదన్న సుప్రీంకోర్టు ఉత్తర్వులపై కేంద్రం రివ్యూ పిటిషన్ దాఖలు చేసింది, ముఖ్యమంత్రులు, మంత్రులు, రాజకీయ నేతల ఫొటోలను ప్రకటనల్లో వేయొద్దని చెప్పడం ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధమని సుప్రీంకు తెలిపిన కేంద్రం... ఈ మేరకు అటార్జీ జనరల్ తో అఫిడవిట్ దాఖలు చేయించింది, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టే సంక్షేమ కార్యక్రమాలు, వివిధ పథకాల గురించి ప్రజలకు తెలియజేయాల్సి ఉంటుందని, అలాంటప్పుడు మంత్రులు, ముఖ్యమంత్రుల ఫొటోలను వాడొద్దనడం సరికాదని అటార్జీ జనరల్ ధర్మాసనానికి నివేదించారు, ఓ ఎన్జీవో సంస్థ వేసిన పిల్ ను విచారించిన సుప్రీం...  ప్రభుత్వ ప్రకటనల్లో ప్రభుత్వాధినేతల ఫొటోలు వేయొద్దని ఆదేశించింది, అయితే ఇప్పుడు కేంద్రం రివ్యూ పిటిషన్ దాఖలు చేయడంతో మరోసారి ఈ కేసును అత్యున్నత ధర్మాసనం విచారించనుంది

Online Jyotish
Tone Academy
KidsOne Telugu