మహారాష్ట్ర గవర్నర్‌గా విద్యాసాగరరావు

 

మహారాష్ట్ర రాష్ట్ర గవర్నర్‌గా తెలంగాణకి చెందిన బీజేపీ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి సీహెచ్ విద్యాసాగరరావు నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్రపతి భవన్ మంగళవారం ఆదేశాలు జారీ చేసింది. విద్యాసాగర్ రావు రెండుసార్లు ఎంపీగా ఎన్నికయ్యారు. ఒకసారి కేంద్ర సహాయ మంత్రిగా పని చేశారు. మూడు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.అలాగే మరికొన్ని రాష్ట్రాలకు కూడా కొత్త గవర్నర్లను నియమించారు. గోవా గవర్నర్గా మృదుల సిన్హా, కర్ణాటక గవర్నర్గా వీఆర్ వాలా, రాజస్థాన్ గవర్నర్గా కళ్యాణ్ సింగ్ నియమితులయ్యారు. నాలుగు రాష్ట్రాల గవర్నర్ల నియమానికి సంబంధించిన ఫైల్కు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఈ రోజు ఆమోద ముద్ర వేశారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu