బ్లాక్ లిస్ట్ లో పెడతామంటూ నిర్మల వార్నింగ్

కేంద్రం ఆదేశాల మేరకు రైతుల నుంచి పొగాకు కొనుగోలు చేయకపోతే వ్యాపారులను బ్లాక్ లిస్ట్ లో పెడతామంటూ కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ హెచ్చరించినట్లు తెలుస్తోంది. కేంద్రం ఆదేశించినా వ్యాపారులు కొనుగోళ్లు జరపక పోవడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసిన నిర్మలా సీతారామన్... పొగాకు బోర్డు అధికారులు, వాణిజ్యశాఖ ప్రతినిధులతో అత్యవసరంగా సమావేశమై సమీక్షించారు. రైతుల ఆత్మహత్యలను నివారించేందుకు పొగాకు కొనుగోలు చేయాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యాపారులు పాటించడం లేదంటూ ఏపీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు నివేదిక ఇవ్వడంతో నిర్మల సీరియస్ అయ్యారు, కేంద్రం ఆదేశాలను పాటించకపోతే బ్లాక్‌లిస్టులో పెడతామంటూ పొగాకు వ్యాపారులకు హెచ్చరికలు పంపారు.