బీఫ్ పార్టీ ఇచ్చాడని ఎమ్మెల్యేపై బీజేపీ అటాక్

 

బీఫ్ వివాదం ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారుతోంది, అనేక రాష్ట్రాల్లో ఒకరిపై మరొకరు దాడులు చేసుకుంటుంటే, కొన్నిచోట్ల చంపుకునే వరకూ వెళ్తోంది, తాజాగా జమ్మూకాశ్మీర్ అసెంబ్లీలో ఏకంగా ఎమ్మెల్యేపైనే దాడి జరిగింది, బీఫ్ పార్టీ ఇచ్చిన ఇండిపెండెంట్ ఎమ్మెల్యే రషీద్ పై బీజేపీ ఎమ్మెల్యేలు భగత్, రాజీవ్ శర్మలు దాడికి దిగి చితకబాదారు, అసెంబ్లీలో అందరూ చూస్తుండగా, స్పీకర్ ఎదుటే దాడికి పాల్పడటంతో మిగతా ఎమ్మెల్యేలంతా విస్తుపోయారు, బీజేపీ ఎమ్మెల్యేల బారి నుంచి రషీద్ ను కాపాడటానికి విపక్ష సభ్యులు తీవ్రంగా కష్టపడాల్సి వచ్చింది. బీఫ్ ను నిషేధించినా తాను తింటానని చెప్పడమే కాకుండా, బీఫ్ పార్టీ ఇచ్చినందుకే రషీద్ పై బీజేపీ ఎమ్మెల్యేలు దాడి చేసినట్లు తెలుస్తోంది, అయితే ఎమ్మెల్యేపై దాడి చేయడాన్ని విపక్ష నేత ఒమర్ అబ్దుల్లా తీవ్రంగా ఖండించారు