కర్ణాటకలో ఉద్రిక్తత..రైతుల ఆగ్రహం..

 

కర్ణాటకలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కర్ణాటక జలాల్ని ఇరు రాష్ట్రాలు కలిసి వాడుకోవాలని.. తమిళనాడుకు కావేరి జలాలు ఇవ్వాల్సిందేనని సుప్రీంకోర్టు తేల్చి చెప్పిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో క‌ర్ణాట‌క రైతులు తీవ్ర‌స్థాయిలో మండిప‌డుతున్నారు. దీనిలో భాంగగానే మాండ్యాలో బంద్ కు పిలుపునిచ్చారు. బెంగ‌ళూరు-మైసూరు జాతీయ ర‌హ‌దారిని రైతులు దిగ్బంధించారు. దీంతో పోలీసులు అక్కడ ఎలాంటి ఉద్రిక్త వాతావరణం నెలకొనకుండా ముందు జాగ్రత్తగా భారీ ఎత్తున మోహరించారు. మ‌రోవైపు కావేరి జ‌లాల వివాదంపై నేడు అఖిలప‌క్ష భేటీకి క‌ర్ణాట‌క ముఖ్య‌మంత్రి సిద్ధ‌రామ‌య్య‌ పిలుపునిచ్చారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu