కాశ్మీర్ సీఎంను అంత మాట అనేసిన సుబ్రహ్మణ్యస్వామి...
posted on Sep 6, 2016 11:27AM
.jpg)
కొద్దిరోజులుగా కేంద్ర అధిష్టానం ఆదేశం మేరకు సైలెంట్ గా ఉన్న బీజేపీ నేత రాజ్యసభ సభ్యుడు సుబ్రహ్మణ్యస్వామి రెండో ఇన్నింగ్స్ స్టార్ చేసిన దగ్గర నుండి మళ్లీ ఆయన నోటికి అదుపు లేకుండా పోయింది. ఆర్బీఐ మాజీ గవర్నర్ రాజన్ నుండే రెండో ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన ఆయన మరోసారి జమ్ము కాశ్మీర్ సీఎం మెహబూబా ముఫ్తీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కాశ్మీర్లో గత కొంత కాలంగా అల్లర్లు చెలరేగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అక్కడి పరిస్థితులను ప్రస్తావించిన స్వామి... ‘‘కశ్మీర్ లో రాష్ట్రపతి పాలన విధించాలి. కుక్క తోక వంకర పోనట్లే... ముఫ్తీ వైఖరిలోనూ ఏ మార్పూ లేదు. ఇక ఎప్పటికి కూడా ముఫ్తీ వైఖరి మారదు. ఆమెకు ఉగ్రవాదులతో లింకులున్నాయి. ఆమె వైఖరిలో మార్పు తీసుకొచ్చేందుకే ఆమె పార్టీతో కలిసి బీజేపీ సంకీర్ణ సర్కారు ఏర్పాటుకు మొగ్గుచూపింది’’ అని స్వామి వ్యాఖ్యానించారు. మొత్తానికి మరోసారి వార్నింగ్ తీసుకునేంత వరకూ స్వామిగారు ఆగేలా కనిపించడంలేదు. మరి దీనిపై ఎంత దుమారం రేగుతుందో చూడాలి.