బోరుబావిలో పడిన బాలుడి మృతి

 

మెదక్ జిల్లా పుల్కల్ మండలం బొమ్మారెడ్డిగూడెం గ్రామంలో శనివారం నాడు బోరుబావిలో పడిన మూడేళ్ళ బాలుడు రాకేష్ మరణించాడు. శనివారం ఉదయం ఏడు గంటల సమయంలో తోటి చిన్నారులతో ఆడుకుంటున్న రాకేష్ ప్రమాదవశాత్తూ బోరుబావిలో పడిపోయాడు. బాలుడిని రక్షించడానికి అధికార యంత్రాంగం చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. బోరుబావిలో తలకిందులుగా 32 అడుగుల లోతులో బాలుడు వున్న విషయాన్ని గుర్తించిన అధికారులు ప్రొక్లెయినర్లతో బోరుబావికి సమాంతరంగా తవ్వడం ప్రారంభించారు. అయితేపెద్దపెద్ద బండలు అడ్డు పడటంతో తవ్వకం చాలా ఆలస్యమైంది. బాగా శ్రమించి తవ్వకాలు జరిపి బాలుడిని బయటకి తీయగా అప్పటికే బాలుడు మరణించాడు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu