కేసీఆర్, హరీష్‌రావులకి మెంటలెక్కింది

 

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌కి, ఆయన మేనల్లుడు హరీష్‌రావుకి మెంటలెక్కిందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అటవీ శాఖ మంత్రి బొజ్జల గోపాలక‌ృష్ణారెడ్డి వ్యాఖ్యానించారు. గురువారం నాడు చిత్తూరులో విలేకరులతో మాట్లాడిన ఆయన కేసీఆర్‌కి, హరీష్‌రావుకి జాయింట్‌గా మతి భ్రమించిందని, అందుకే వాళ్ళిద్దరూ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు మీద పిచ్చిపట్టినట్టు మాట్లాడుతున్నారని అన్నారు. ముఖ్యమంత్రులుగా, మంత్రులుగా బాధ్యతాయుతమైన పదవుల్లో వున్నవారు పద్ధతి లేకుండా మాట్లాడ్డం భావ్యం కాదని గోపాలకృష్ణారెడ్డి అభిప్రాయపడ్డారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu