దేశం లో ఉన్నవారంతా వందేమాతరం పాడాల్సిందే..

దేశం లో ఉన్నవారంతా వందేమాతరం పాడాల్సిందే. ఇది బీజీపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోమువీర్రాజు మాట. శుక్రవారం పలువురు ముస్లిం నాయకులు సోమువీరాజులు సమక్షంలో బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా సోమువీర్రాజు మాట్లాడుతూ.. దేశంలో ఉన్నవారంతా వందేమాతరం పాడాల్సిందే అని అన్నారు. దేశభక్తి, రాముడు ఆలోచనలే బీజేపీ సిద్ధాంతాలని వీర్రాజులు చెప్పారు. . అబ్దుల్ కలాంని రాష్ట్రపతి చేసింది బీజేపీనే అని గుర్తుచేశారు. దేశంలో మైనార్టీల అభివృద్ధి బీజేపీతోనే సాధ్యమని స్పష్టం చేశారు. ఏపీలో జరుగుతున్న ప్రతి అభివృద్ధి కేంద్రం చేస్తున్నదే అని సోమువీర్రాజు తెలిపారు. అయితే వీర్రాజు వ్యాఖ్యలపై కొందరు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. దేశ భక్తి తో వందేమాతరం అని అనలిగాని.. దేశంలో ఉన్నవారంతా  వందేమాతరం పాడాల్సిందే అని బెదిరించడమేంటని వీర్రాజు వ్యాఖ్యలను తప్పుబడుతున్నారు.
 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu