టోల్ గేట్ ఉద్యోగిపై ఎంపీ గారి దౌర్జన్యం..


రోజు రోజుకి బీజేపీ నేతల ఆగడాలు ఎక్కువయ్యాయి. ఎవరో ఒకరు ఏదో ఒక వివాదంలో చిక్కుకుంటూనే ఉన్నారు. ఇప్పుడు తాజాగా ఓ బీజేపీ ఎంపీ గారి దౌర్జన్యం బయటపడింది. తన వాహనాన్ని అడ్డుకున్నందుకు టోల్ గేట్ ఉద్యోగిని ఎంపీ అనుచరులు చితకొట్టారు. ఈ ఘటన రాజస్థాన్లో జరిగింది. రాజస్థాన్ లోని భరత్ పూర్ బీజేపీ ఎంపీ బహదూర్ సింగ్ కోలీ తన నియోజక వర్గంలో పర్యటించారు. ఈ నేపథ్యంలో భరత్ పూర్ లోని టోల్ గేట్ వద్ద రుసుం చెల్లించకుండా ఆయన వాహనం వెళుతుండగా, అక్కడి ఉద్యోగి ఆ వాహనాన్ని ఆపాడు. దీంతో సదరు ఎంపీ గారి అనుచరులు రెచ్చిపోయి ఉద్యోగిని కొట్టారు. అయితే అది కాస్త సీక్రెట్ కెమెరాల ద్వారా రికార్డయింది. దీంతో ఆ వీడియో బయటకు రావడంతో ఎంపీ గారిపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. మరి దీనిని ఎంపీ గారు ఏ విధంగా కవర్ చేసుకుంటారో చూద్దాం..