మాజీ జడ్జి ఇంటిపై వైసీపీ పిశాచ మూకల దాడి!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీహార్‌ని మించిన ఆటవిక రాజ్యం నడుస్తోంది. వేధింపులు, దాడులు వైసీపీ నాయకులకు మామూలు విషయంలా మారిపోయాయి. రాజకీయ ప్రత్యర్థులు, సామాన్య ప్రజల విషయంలో మాత్రమే కాదు... మాజీ జడ్జి విషయంలోనూ వైసీపీ పిశాచాలు తమ ఆటవిక ప్రవృత్తినే ప్రదర్శిస్తున్నాయి. తాజాగా అన్నమయ్య జిల్లాలో బి.కొత్తకోటలో రిటైర్డ్ జడ్జ్ రామకృష్ణ ఇంటి మీద వైసీపీ మూకలు మంగళవారం అర్ధరాత్రి దాడిచేశాయి. వేటకొడవళ్ళతో రామకృష్ణ ఇంట్లోకి ప్రవేశించిన ఈ మూకలు విధ్వసాన్ని సృష్టించాయి. కారు, ఫర్నిచర్, కిటికీలు.. ఇలా ఏది కనబడితే దాన్ని ధ్వంసచేసేశారు. గతంలో కూడా వైసీపీ మూకలు రామకృష్ణ ఇంటి మీద దాడి చేశాయి. ఈ విషయమై రామకృష్ణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆయన ఆరోపిస్తున్నారు.