మళ్లీ తెరపైకి గో మాంసం వివాదం.. మహిళలను చితక్కొట్టారు..

 

గో మాంసంపై వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. గతంలో గో మాంసంపై దేశంలో పెద్ద దుమారమే రేగగా.. ఇప్పుడు మరోసారి ఈ వ్యవహారంపై వివాదం చెలరేగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే గో మాంసం అమ్మేందుకు ప్రయత్నిస్తున్నారని చెప్పి ఇద్దరు దళిత మహిళలను చితకబాదారు. ఈ ఘటన మధ్యప్రదేశ్లో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. మధ్యప్రదేశ్లో మన్ సౌ రైల్వే స్టేషన్ లో ఇద్దరు మహిళలు గో మాంసం విక్రయిస్తున్నారని చెప్పి హిందూదళ కార్యకర్తలు దాడి చేశారు. వారిని చితక్కొట్టారు. అయితే పక్కన పోలీసులు ఉన్న వారిని ఆపకుండా ఏదో సినిమా చూస్తున్నట్టు చూడటం గమనార్హం. చివరికి కార్యకర్తలను అదుపుచేసి వారిద్దరిని అరెస్ట్ చేశారు.