ప్రజలను రెచ్చగొట్టడం సరికాదు... ఇద్దరు సీఎంలకు కిషన్ రెడ్డి హితువు
posted on Jun 13, 2015 5:56PM

తెలంగాణ జీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి రెండు రాష్ట్రాల సీఎంలకు ఓ సలహా ఇచ్చారు. అదేంటంటే ఇద్దరు మంత్రులు మానసిక ప్రశాంతత కలిగి ఉండాలని.. రాజకీయాలను పక్కన పెట్టి రాష్ట్రాల అభివృద్ధికి పాటుపడాలని సూచించారు. నోటుకు ఓటు కేసు గురించి పట్టించుకోవడానికి న్యాయస్థానాలు, ఏసీబీ ఉందని.. ఈ వ్యవహారంపై తాము ఇవ్వాల్సిన నివేదిక ఇచ్చామని తెలిపారు. కాగా జీజేపీ టీడీపీ పొత్తు విషయమై మాట్లాడుతూ తప్ప, ఒప్పులు తేలిన తరువాతే పొత్తుల విషయం చూద్దామని వ్యాఖ్యానించారు. అలాగే ప్రజలను రెచ్చగొట్టడం మంచిది కాదని కిషన్ రెడ్డి... ఇద్దరు సీఎంలకు హితవు పలికారు. ఈనెల 21న యోగా దినం సందర్భంగా .. సంజీయ్యపార్కులో ఉ. 7 నుంచి ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు