కమలం దిశగా సైకిల్‌ పయనం

 

బిజెపితో పొత్తు దిశగా చంద్రబాబు అడుగులు పడుతున్నాయంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఢిల్లీ పర్యటనలో భాగంగా పలువురు జాతీయ నేతలను కలిసిన చంద్రబాబు ఈ మేరకు సంకేతాలనిచ్చారు. రాష్ట్రంలో నెలకొన్నపరిస్థితులను రాష్ట్రపతితో పాటు పలువురు నేతలతో చర్చించిన ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.

ఎన్డీయేతో కలిసి తాము దేశాన్ని ఎంతో అభివృద్ది చేశామన్న చంద్రబాబు, యుపిఏ మాత్రం దేశాన్ని నాశనం చేసిందని విమర్శించారు. అయితే ఈ సందర్భంలో విభజనకు ముందు నుంచి మద్దతు తెలుపుతున్న బిజెపిని చంద్రబాబు విమర్శించకపోగా, ప్రస్థుతం దేశంలో అభివృద్దిలో బాగంగా ఉన్న విశాలమైన రోడ్లు, ఐటి టెక్నాలజీ వంటివి బిజెపి చేసిన అభివృద్దే అని కొనియాడారు.

అయితే ఈ విషయం అధికారికంగా చెప్పాటనికి చంద్రబాబు ఇష్టపడలేదు, ఢిల్లీలో రాజ్‌నాధ్‌ను కలిసిన ఆయన్ను ఎన్డీఏతో పొత్తు, మోడి ప్రదాని అభ్యర్ధిత్వంపై పాత్రికేయులు అడిగిన ప్రశ్నలను బాబు దాటవేశారు. దీంతో ఈసారి జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో బాబు బిజెపిల పొత్తు కాయమంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu