హైదరాబాద్ వాహనదారులకు బిగ్ అలర్ట్ 

 హైద్రాబాద్ పోలీసులు మంగళవారం నుంచి (నవంబర్ 5)  స్పెషల్ డ్రైవ్ చేపట్టారు.  వాహనదారులు  ట్రాఫిక్ నియమనిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని ట్రాఫిక్ పోలీసులు హెచ్చరిస్తున్నారు. హెల్మెట్  లేకుండా ప్రయాణిస్తే , రాంగ్ సైడ్  డ్రైవింగ్ కు కు వ్యతిరేకంగా ప్రయాణిస్తే కఠినచర్యలు తీసుకుంటున్నట్టు హెచ్చరించారు.  ఈ సంవత్సరం ఇప్పటివరకు రోడ్డు ప్రమాదాలు జరిగి 215 మంది మృత్యువాత పడ్డారు. వీరిలో చాలామంది హెల్మెట్ లేకుండా ప్రయాణించిన వారే . హెల్మెట్ తప్పనిసరి చేస్తూ ఈ స్పెషల్ డ్రైవ్ కొనసాగించనున్నట్టు ట్రాఫిక్ అడిషనల్ కమిషనర్ (ట్రాఫిక్) పి. విశ్వప్రసాద్ తెలిపారు. తలకు గాయమైతే మరణించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నారు. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu