దేవరగట్టు ఉత్సవంలో 70 మందికి గాయాలు!

దేవరగట్టులో జరిగిన బన్నీ ఉత్సవంలో ప్రజలు ఒకరినొకరు కర్రలతో కొట్టుకోవడం వల్ల 70 మంది గాయపడ్డారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా వుంది. కర్నూలు జిల్లా హోళగుంద సమీపంలోని దేవరగట్టులో ప్రతి ఏటా దసరా సందర్భంగా బన్నీ ఉత్సవం జరుగుతుంది. ఈ ఉత్సవం సందర్భంగా ప్రజలు కర్రలతో ఒకరినొకరు కొట్టుకుంటారు. ఇది ఈ ప్రాంతంలో తరతరాలుగా వస్తున్న సంప్రదాయం. ఈ సంప్రదాయాన్ని ఆపటానికి చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ప్రతి సంవత్సరం జరిగే ఈ బన్నీ ఉత్సవం సందర్భంగా గతంలో ఎన్నోసార్లు కొంతమంది చనిపోయిన సందర్భాలు కూడా వున్నాయి. అయినప్పటికీ ఈ సంప్రదాయం ఆగలేదు. ఈ సంవత్సరం భారీ స్థాయిలో బన్నీ ఉత్సవం జరిగింది. ప్రజలు ఒకరినొకరు కర్రలతో కొట్టుకున్నారు. 70 మంది ఈ సందర్భంగా గాయపడ్డారు. ఇద్దరి పరిస్థితి విషమించిందని సమాచారం. ఈ సంవత్సరం ఇలా జరిగిందని వచ్చే సంవత్సరం జనం ఆగరు. కర్రలతో కొట్టుకోవడం ప్రాణాల మీదకు తెచ్చుకోవడం దేవరగట్టు బన్నీ ఉత్సవంలో షరా మామూలే.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu