పోలీసులతో బాలకృష్ణ గొడవ పడలేదు

తెలుగుదేశం పార్టీ నిర్వహిస్తున్న మహానాడులో బాలకృష్ణ పోలీసుల మీద పైర్ అయ్యారని వస్తున్న వార్తలను కొట్టిపారేశారు. మహానాడు ప్రాంగణంలో అభిమానుల సంఖ్య ఎక్కువగా వుండడంతో, ఇబ్బంది కలగకుండా వుండడం కోసం పోలీసుల అనుమతితోనే మెయిన్ గేట్ వరకు కార్ లోనే వెళ్ళవలసి వచ్చిందని ఆయన వివరణ ఇచ్చారు. మరోవైపు మహానాడులో బాలకృష్ణ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.తె లుగుదేశం పార్టీ మూడు రోజుల మహానాడు బుధవారంనాడు ఉదయం హైదరాబాదులో ప్రారంభమైంది. వేదికపై తెలంగాణకు చెందిన కాకతీయ స్తూపం, ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి చిహ్నాలను ఉంచారు.