క్రమశిక్షణకు మారుపేరు టీడీపీ

తెదేపా 34వ మహానాడు ప్రారంభమైంది. ఈ సందర్భంగా పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు క్రమశిక్షణకు మారుపేరు టీడీపీ అని, తెలుగు జాతిని ఒకటి చేసే పార్టీ తెదేపా అని అన్నారు. వైసీపీ, టీఆర్ ఎస్ తో కాంగ్రెస్ కుమ్మక్కై టీడీపీని దెబ్బతీయాలని చూసింది కానీ, కాంగ్రేస్ కే డిపాజిట్లు కూడా దక్కలేదని అన్నారు. కాంగ్రెస్ పార్టీ భూస్థాపితమైపోయిందని, కోలుకునే పరిస్థితి లేదని అన్నారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని నాశనం చేసిందన్నారు. వైసీపీ పుట్టుకే అవినీతి పుట్టుకని, 30 ఏళ్లు చరిత్ర ఉన్న మన పార్టీకే ఛానల్ లేదుకాని నిన్న కాక మొన్న వచ్చిన పార్టీ అవినీతి సొమ్ముతో ఛానల్ పెట్టి మనల్ని విమర్శిస్తుందని ఎద్దేవ చేశారు.