టిడిపిని టార్గెట్ చేశారు

తెలంగాణ లో తెలుగుదేశం పార్టీని టార్గెట్ చేశారని టిడిపి అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీని టీఆర్‌ఎస్‌ ఇబ్బంది పెట్టాలని చూస్తోందని, దాని కోసం మన నాయకులను బజారులో పశువుల్లా కొంటున్నారని ధ్వజమెత్తారు. తెలంగాణను టీడీపీనే అభివృద్ధి చేసిందని, దానిపై చర్చకు సిద్ధంగా ఉన్నామని సవాల్‌ విసిరారు. 1995 నాటి పరిస్థితి,  ఇప్పటి పరిస్థితిపై చర్చిద్ధామన్నారు. తెలంగాణలో సమస్య ఉన్న చోట మన నాయకులున్నారని, ప్రజాసమస్యలపై రాజీలేని పోరాటం చేస్తున్నామని చంద్రబాబు తెలిపారు.   

Online Jyotish
Tone Academy
KidsOne Telugu