ఈశాన్యంలో వికసించిన కమలం..అసోంలో బీజేపీ పాగా

అసోంలో బీజేపీ చరిత్ర సృష్టించింది. అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో తిరుగులేని ఆధిక్యంతో విజయం సాధించి తొలిసారిగా అధికారం చేపట్టనుంది. ఎగ్జిట్ పోల్స్ సర్వేలు చెప్పినట్లే బీజేపీ అధికార పీఠాన్ని కైవసం చేసుకుంది. 126 సీట్లున్న అసోంలో బీజేపీ 78 స్ధానాల్లో ఆధిక్యంలో ఉంది. కాంగ్రెస్ కేవలం 21 చోట్ల ముందంజలో ఉంది. ఏఐయూడీఎఫ్ 15, ఇతరులు ఆరు చోట్ల ఆధిక్యంలో ఉన్నారు. వరుసగా మూడుసార్లు సీఎంగా బాధ్యతలు చేపట్టిన తరుణ్ గగోయ్ నాలుగో సారి ముఖ్యమంత్రి కావాలని ఆశించారు. కాని ఆయనపై ఉన్న వ్యతిరేకత బీజేపీకి అనుకూలంగా మారింది. బీజేపీ అభ్యర్థి శరబానంద్ సోనావాల్ సీఎం కానున్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu