బెజవాడ మెట్రోకు కేంద్రం గ్రీన్ సిగ్నల్

నవ్యాంధ్ర రాజధాని ప్రాంతం విజయవాడలో మెట్రోరైలు ప్రాజెక్టు శరవేగంగా పట్టాలెక్కుతోంది. ఇప్పటికే గ్రౌండ్ వర్క్ పూర్తిచేసి ఢిల్లీ మెట్రో శ్రీధరన్ నివేదిక ఇవ్వగా, రాష్ట్ర ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది. ఇప్పుడు తాజాగా కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ సూత్రప్రాయంగా అంగీకారం తెలిపింది. మెట్రో ప్రాజెక్టు చేపట్టేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందుకెళ్లొచ్చని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు తెలిపారు. మొత్తం 25 కిలోమీటర్ల పొడవున రెండు లైన్లతో నిర్మాణం కానున్న విజయవాడ మెట్రోరైల్ ప్రాజెక్టును, మెట్రో గురు శ్రీధరన్ నేతృత్వంలో... ఢిల్లీ మెట్రోరైలు కార్పొరేషన్ చేపట్టనుంది. విజయవాడలో మెట్రోరైలు పూర్తికాగానే, దాన్ని గుంటూరు వరకు విస్తరించనున్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu