డ్రైవర్‌కి హార్ట్ ఎటాక్.. పొలాల్లోకి బస్సు!

బాపట్ల జిల్లాలో ఆర్టీసీ బస్సును నడుపుతున్న డ్రైవర్‌ సాంబశివరావు డ్రైవింగ్ సీట్‌లో వుండగానే గుండెపోటు వచ్చి మరణించారు. రేపల్లె నుంచి చీరాల వెళ్తున్న బస్సును సాంబశివరావు డ్రైవ్ చేస్తున్న సమయంలో, కర్లపాలెం సమీపంలో ఆయనకు గుండెపోటు వచ్చింది. దాంతో ఆయన బస్సు వేగాన్ని తగ్గించారు. బస్సు వేగం అయితే తగ్గిందిగానీ, అదుపు తప్పింది. దాంతో రోడ్డు మీద వెళ్తున్న ఒక సైకిల్‌ని బస్సు ఢీకొంది. దాంతో ఆ సైకిలిస్టుకు గాయాలయ్యాయి. అదుపుతప్పిన బస్సు పొలాల్లోకి దూసుకెళ్ళి ఆగిపోయింది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో మొత్తం 40 మంది ప్రయాణికులు వున్నారు. ఎవరికీ ఎలాంటి గాయాలు తగల్లేదు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu