ఏపీ ప్రత్యేక హోదా.. కేంద్రం.. మధ్యలో జయలలిత



ఏపీ ప్రత్యేక హోదా రాకపోవడానికి.. కేంద్రం ప్రత్యేక హోదా గురించి ఏం నిర్ణయం తీసుకోకపోవడానికి కారణం తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితనే కారణమా అంటే అవుననే సంకేతాలే వినిపిస్తున్నాయి. ఏపీ ప్రత్యేక హోదాకి.. జయలలితకు.. కేంద్రానికి మధ్య సంబంధం ఏంటా అనుకుంటున్నారా. అదేంటంటే కేంద్రం కనుక ఏపీకి ప్రత్యేక హోదా ప్రకటిస్తే.. తమిళనాడుకు రావాల్సిన పెట్టుబడులుకాని.. పరిశ్రమలు కానీ రావని.. అవి ఏపీకి వెళతాయని.. ఈ ఉద్దేశ్యంతోనే జయలలిత ఏపీ ప్రత్యేక హోదా విషయంలో కేంద్రానికి అడ్డుపుల్ల వేస్తున్నట్టు తెలుస్తోంది. అలాగని జయలలితను కాదని కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక హోదాని ప్రకటించలేని పరిస్థితి. ఎందుకంటే ప్రస్తుతం రాజ్యసభలో జయలలిత మద్దతు తప్పనిసరి. అందుకే మోడీ కూడా ప్రత్యేక హోదాపై ఎలాంటి ప్రకటన చేయకపోవడానికి కారణం. ఇదే విషయాన్ని కేంద్రమంత్రులు చంద్రబాబుకు కూడా తెలియజేసినట్టు తెలుస్తోంది. మీరు కనుకు ఈ విషయంలో జయలలితను ఒప్పించగలిగితే ప్రత్యేక హోదాపై కేంద్రానికి పెద్దగా అభ్యంతరాలు ఉండకపోవచ్చని సూచించారట. దీంతో చంద్రబాబు జయలలితను ఎలా కన్విన్స్ చేయాలా అని ఆలోచనలో పడ్డట్టు సమాచారం. తమిళనాడుకు ఏపీ ప్రత్యేక హోదా వల్ల ఎలాంటి సమస్య ఉండదని చెప్పి జయలలితను ఒప్పించాలి. మరి ఏ రకంగా చంద్రబాబు జయలలితను ఒప్పిస్తారో చూడాలి

Online Jyotish
Tone Academy
KidsOne Telugu