ఇద్దరు సీఎంలను ఏసీబీ విచారించాలి..

ఓటుకు నోటు కేసులో తెదేపాను దెబ్బతీయడానికి ప్రతిపక్షాలు బాగానే ప్రయత్నిస్తున్నాయి. ప్రతిపక్షాలకు ఇది ఒక ఆయుధంగా మారిందనే చెప్పాలి. అటు కాంగ్రెస్ నేతలు, వైకాపా నేతలు తెదేపాను విమర్శించడమే పనిగా పెట్టుకున్నట్టున్నారు. ఈ నేపథ్యంలో ఏపీ పీసీసీ అధ్యక్షుడు రఘువీరా రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి, ఆంధ్రా ముఖ్యమంత్రులపై ఉన్న అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఇరు రాష్ట్రాల సీఎంలు తమ హోదాను మరిచిపోయి ప్రవర్తిస్తున్నారని.. అసలు ఇద్దరు సీఎంలను ఏసీబీ విచారించాలని అన్నారు. ఓటుకు నోటు కేసును సుప్రీంకోర్టు న్యాయమూర్తితో విచారణ జరిపించాలని కోరారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu