సీఎం క్యాంపు కార్యలయం ప్రారంభించిన చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని భూమి పూజ రోజు జరగాల్సిన సీఎం క్యాంపు కార్యాలయం ప్రారంభోత్సవం కొన్ని అనివార్య కారణాల వల్ల వాయిదా పడిన సంగతి తెలిసిందే. అయితే ఈ రోజు ఉదయం విజయవాడలోని సీఎం క్యాంపు కార్యాలయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. విజయవాడలో ఉన్న ఇరిగేషన్‌ క్యాంప్‌ కార్యాలయాన్నే ఏపీ భారీ నీటి పారుదల శాఖ మంత్రి దేవినేని ఉమా సీఎం క్యాంప్‌ ఆఫీస్‌గా మార్చారు. ఈ కార్యక్రమానికి మంత్రులు యనమల రామకృష్ణ, దేవినేని ఉమ, కామినేని శ్రీనివాస్, ఎమ్మెల్యే బాలకృష్ణ, సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu