అల్జీరియా విమానం కూలింది.. కానీ.. ఎక్కడుంది?

 

అల్జీరియాకు చెందిన ఒక పౌరవిమానం గురువారంనాడు బుర్కినా ఫాసో నుంచి అల్జీర్స్‌కు వస్తుండగా కూలిపోయింది. ఈ విమానంలో 110 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బంది ఉన్నారు. టేకాఫ్ తర్వాత ఈ విమానం జాడ కనిపించలేదు. అయితే ఈ విమానం కూలిపోయిందని అధికారులు నిర్ధారణగా చెబుతున్నారు. అయితే ఎక్కడ కూలిందన్న విషయంలో మాత్రం ఇంకా స్పష్టత రాలేదు. మొదట ఓ నదిలో కూలిపోయిందన్న వార్తలు వచ్చాయి. ఆ తర్వాత ఎడారిలో కూలిపోయిందని అన్నారు. తాజాగా మాలీ ప్రాంతంలో ఈ విమానం కూలిపోయిందని అంటున్నారు. భారీగా వర్షం కురుస్తూ వుండడం, ప్రచండ గాలులు వీస్తూ వుండడం వల్ల ఈ విమానం కూలిపోయిందని అధికారులు చెబుతున్నారు. ఈ విమానంలో ఎక్కువమంది ఫ్రెంచ్, స్పానిష్ జాతీయులే వున్నట్టు తెలుస్తోంది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu
Related Segment News