ఏపీ రాజధానికి పైసా ఇచ్చేది లేదు.. కేంద్రం

 

పీ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని తేల్చి చెప్పేసిన కేంద్రం ఇప్పుడు మరో షాకింగ్ వార్తను బయటపెట్టింది. ఇప్పటివరకూ నవ్యాంధ్ర రాజధాని అమరావతికి కేంద్ర ప్రభుత్వం రూ.2,050 కోట్ల నిధులు ఇవ్వగా.. ఇకపై అమరావతి నిర్మాణానికి సింగిల్ పైసా విడుదల చేయలేమని.. ఇప్పటిదాకా కేటాయించిన నిధులతోనే సరిపెట్టుకోవాలని చెప్పింది. అరుణ్ జైట్లీ సమక్షంలో రాష్ట్ర ఆర్ధిక శాఖ అధికారులతో భేటీ జరుగగా.. కేంద్ర చెప్పిన మాటలు విని రాష్ట్ర ఆర్థిక శాఖ అధికారులు అవాక్కైనంత పనైంది. విభజన చట్టంలోని 94(3) సెక్షన్ ప్రకారం.. రాజ్ భవన్, హైకోర్టు, సచివాలయం, అసెంబ్లీ, శాసనమండలి భవనాలను మాత్రమే తాము నిర్మించాల్సి ఉందని.. ఈ భవనాలన్నింటినీ రూ.2,050 కోట్లతోనే నిర్మించుకోవచ్చని వాదించింది. అంతేకాదు సాధ్యం కాదని ఏపీ భావిస్తే... ఆ నిధులను వెనక్కిస్తే తామే వాటిని నిర్మించి ఇస్తామని చెప్పడంతో ఏపీ అధికారులు ఖంగుతినాల్సిన పరిస్థితి ఏర్పడింది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu