దిగొచ్చిన మహారాష్ట్ర మంత్రి.. పదవికి రాజీనామా..

 


మహారాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి ఏక్ నాథ్ ఖడ్సే కు అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంతో సంబంధాలు ఉన్నాయని.. ఇంకా అవినీతి ఆరోపణలు కూడా వెల్లువెత్తాయి. ఈనేపథ్యంలో ఆఖరికి ఖడ్సే తన మంత్రి పదవికి రాజీనామా చేయక తప్పలేదు. అసలు సంగతేంటంటే.. ఖడ్సేకు దావూద్ ఇబ్రహీం నుండి ఫోన్ కాల్స్ వచ్చాయని ఓ పత్రిక ద్వారా వెలుగులోకి వచ్చింది. దీంతో దేశవ్యాప్తంగా కలకలం రేగుతున్న సమయంలో.. అవినీతి ఆరోపణలు వచ్చాయి. ఈనేపథ్యంలో మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ మంత్రి గారిని రాజీమానా చేయాలని ఆదేశించారు. అయితే సదరు మంత్రిగారు మాత్రం ససేమీరా అనడంతో.. సీఎం నేరుగా ప్రధానమంత్రి మోడీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమితా షా లకు ఫిర్యాదు చేయడంతో.. వీరు ఇద్దరు ఆగ్రహించే సరికి ఖడ్సే రాజీనామా చేయాల్సి వచ్చింది. తన రాజీనామా లేఖను ఫడ్నవీస్ కు అందజేశారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu