రేపు తెల్లవారుజామునుంచే భూమి పూజ కార్యక్రమాలు

ఎన్నో అనుమానాల మధ్య ఎట్టకేలకు ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని శంఖుస్థాపన జూన్ 6న జరగబోతుంది. రాజధాని శంఖుస్థాపన నేపథ్యంలో భూమి పూజ కార్యక్రమాలు శనివారం తెల్లవారుజాము మూడుగంటల నుండే ప్రారంభంకానున్నాయి. మందడం సర్వే నెంబరు 135, 136 లో ఉదయం 8 గంటల 49 నిమిషాలకు పూజ జరగనుంది. ఈపూజా కార్యక్రమంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు దంపతులు పాల్గొననున్నారు. అనంతరం చంద్రబాబు విజయవాడలోని క్యాంపు కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు. విజయవాడలో ఉన్న ఇరిగేషన్‌ క్యాంప్‌ కార్యాలయాన్నే ఏపీ భారీ నీటి పారుదల శాఖ మంత్రి దేవినేని ఉమా సీఎం క్యాంప్‌ ఆఫీస్‌గా మార్చారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu