ఏపీ నిరుద్యోగులకు శుభవార్త..త్వరలో ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్లు

 

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ఈ రోజు కేబినెట్ మీటింగ్ జరిగింది. అయితే ఈసందర్బంగా కేబినెట్ నిరుద్యోగులను తృప్తి పరిచే ఓ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేయాలని కేబినెట్ నిర్ణయించుకున్నట్టు సమాచారం. అయితే మొదటి దశలో పదిశాఖల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేయడానికి నిర్ణయం తీసుకుంది. ఇంకా పలు నిర్ణయాలను మంత్రివర్గం తీసుకుంది. అలాగే అనుమతులు లేకుండా తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న ప్రాజెక్టులపై కేంద్రానికి లేఖ రాయాలని, అవసరం అనుకుంటే సుప్రీం కోర్టుకు కూడా వెళ్లాలని కేబినెట్ నిర్ణయించింది. రాష్ట్రంలో కరవు నివారణా చర్యలు, ఇంకుడు గుంతలు, నీరు-ప్రగతి పథకాలను సమర్థంగా అమలయ్యేలా చూడాలని నిర్ణయించారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu